rajamudranews.com
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 7:17 am Posted by : RAJAMUDRA NEWS

రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులివ్వాలి -టీఎస్ఎస్ డబ్ల్యూజేఏ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న -తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానం. -నవంబర్‌లో వార్షికోత్సవ సభ నిర్వహణకు ప్రత్యేక కమిటీ

కామారెడ్డి, రాజముద్ర, న్యూస్:

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హాజరైన జర్నలిస్టులు పలు కీలక అంశాలపై చర్చించి ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సమావేశానికి సంఘ వ్యవస్థాపకులు కట్కూరు మల్లేష్, ఆరెల్లి మల్లేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం, అక్రిడిటేషన్ కమిటీల్లో అసోసియేషన్ ప్రతినిధులకు స్థానం కల్పించడం, రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టు వివరాలను సేకరించడం వంటి అంశాలపై సమావేశంలో తీర్మానాలు చేశారు. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు.
నవంబర్‌లో నిర్వహించనున్న వార్షికోత్సవ సభను విజయవంతం చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వార్షికోత్సవ ఆహ్వాన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆహ్వాన కమిటీ చైర్మన్‌గా ఎల్ల సంతోష్ కుమార్, వైస్ చైర్మన్‌గా ఇడపాక సురేష్ కుమార్, కోశాధికారిగా నెమ్రాది వెంకన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కోసినోల్ల అరుణ్‌ను నియమించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు డా, దుర్గం నగేష్, కుంటోల్ల వెంకటస్వామి, ఈరోళ్ల పురుషోత్తం,చుంచు బాబు,తెడ్డు సాయిలు, మహేందర్, ఈ సురేష్,వెంకన్న, సాయిరాం ఈదునూరి మహేష్ తోపాటు,వివిధ జిల్లాల జర్నలిస్టులు పాల్గొన్నారు.