ePaper
Tuesday, August 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మాట నిలబెట్టిన నాయకుడు-ద్రోణవల్లి సతీష్

మాట నిలబెట్టిన నాయకుడు-ద్రోణవల్లి సతీష్

📰 Generate e-Paper Clip

 

బీర్కూర్, రాజముద్ర న్యూస్:

బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మాజీ జెడ్పిటిసి సభ్యుడు ద్రోణవల్లి సతీష్ ఆదివారం సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. గ్రామంలోని జ్ఞానేశ్వర్ మందిరం వద్ద బోర్వెల్ వేయించడం ద్వారా తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించారు.
గ్రామంలో గతంలో నీటి కొరత తీవ్రంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన సతీష్ ముందుగా గ్రామస్థులకు హామీ ఇచ్చి, ఆ మాటను నిలబెట్టుకుంటూ బోర్వెల్ త్రవ్వకాలను చేపట్టారు. ఆదివారం రోజున ఈ పనులు పూర్తయ్యి, గ్రామ ప్రజలకు అందుబాటులోకి రావడంతో ఆనందం వెల్లివిరిసింది.
వేసవి కాలంలో ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎదుర్కొనే నీటి కష్టాలు ఇక తగ్గిపోతాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న సతీష్ నాయకత్వాన్ని గ్రామ పెద్దలు ప్రశంసించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ద్రోణవల్లి సతీష్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. కిష్టాపూర్ గ్రామ అభివృద్ధిలో ఈ బోర్వెల్ ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హట్కరి కృష్ణ, మాజీ సర్పంచ్ పుల్లెని బాబురావు, నాయకులు బుజ్జముల భాస్కర్, పర్సు గంగాధర్, దండు గంగాధర్, పెద్ద బోయిన గోపాల్, సంజీవ్, మాణిక్, సాయిలు, మల్లేష్, పర్సు హనుమంతు, గోపాల్, తోట విఠల్ మహారాజ్, తోట రాములు మహారాజ్, భూమేష్ చారి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!