ePaper
Friday, August 7, 2026
📄 ePaper
Homeతెలంగాణన్యాయం కూడా అమ్ముడవుతుందా?

న్యాయం కూడా అమ్ముడవుతుందా?

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, రాజముద్ర , న్యూస్:

న్యాయం ముందు అందరూ సమానమే” అని మన రాజ్యాంగం చెబుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఈ మాటలు కేవలం పుస్తకాలకే పరిమితమైపోయాయని అనిపిస్తోంది. నేటి సమాజంలో డబ్బున్నవారికి ఒక రకం న్యాయం, డబ్బులేని పేదవారికి మరో రకం న్యాయం జరుగుతోందనే భావన ప్రజల్లో బలంగా పెరుగుతోంది.
పేదవాడు అన్యాయం జరిగితే ముందుగా పోలీస్ స్టేషన్ ద్వారం తడతాడు. అక్కడే అతని సమస్యలు మొదలవుతాయి. సరైన స్పందన లేకపోవడం, ప్రభావవంతుల ఒత్తిళ్లు, కేసులు నమోదు కాకపోవడం వంటి సమస్యలు అతనిని నిస్సహాయుడిని చేస్తాయి. అదే కేసులో డబ్బున్నవాడు ఉంటే మాత్రం వెంటనే చర్యలు తీసుకుంటారు. ఇది న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది.
కోర్టుల విషయానికి వస్తే పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉంటుంది. కేసులు సంవత్సరాల తరబడిసాగుతాయి. న్యాయం కోసం పేదవాడు తన సంపాదన అంతా ఖర్చు చేస్తూ చివరకు అలసిపోతాడు. కానీ ధనవంతుడు మాత్రం మంచి న్యాయవాదులను నియమించుకుని, వ్యవస్థలో ఉన్న లు పోల్స్ ను ఉపయోగించుకుని తనకు అనుకూలంగా తీర్పులు పొందగలుగుతున్నాడు.ఇలాంటి పరిస్థితులు ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో న్యాయం సమానంగా అందకపోతే అది ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది. పేదవాడు న్యాయం దొరకదనే భావనతో మౌనంగా ఉంటే, అది సమాజంలో అసమానతలను మరింత పెంచుతుంది.
ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీస్ వ్యవస్థలో పారదర్శకత పెరగాలి. కోర్టులలో వేగవంతమైన విచారణలు జరగాలి. పేదవారికి ఉచిత న్యాయసహాయం మరింత బలోపేతం చేయాలి. ముఖ్యంగా “డబ్బు ఉన్నవారికి మాత్రమే న్యాయం” అనే భావనను పూర్తిగా తొలగించాలి.
చివరగా, న్యాయం అనేది ఒక హక్కు — అది ధనికుడి ప్రత్యేక హక్కు కాదు. పేదవాడి గళం కూడా వినిపించే రోజే నిజమైన ప్రజాస్వామ్యం సాకారం అవుతుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!