Lok Sabha Elections: నేటితో ఎన్నికల ప్రచారం ముగింపు.. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు బీజీ

On
Lok Sabha Elections: నేటితో ఎన్నికల ప్రచారం ముగింపు.. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు బీజీ

Lok Sabha Elections: నేటితో ఎన్నికల ప్రచారం ముగింపు.. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు బీజీ

 

రాజముద్ర, వెబ్ డెస్క్:సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. నేటితో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మే11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మే12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు సైలెన్స్ పీరియడ్ గా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి వీలులేదు.

రోడ్ షో లు, సమావేశాలు, సోషల్ మీడియా ప్రచారాలు, పత్రికా ప్రకటనలు అన్నీ ఈ రోజు సాయంత్రానికి పరిసమాప్తం అవుతాయి. అలాగే స్థానికేతరులు సాయంత్రం 6 గంటల తర్వాత అయా నియోజకవర్గాల నుంచి వెళ్ళిపోవల్సి ఉంటుంది. అయా నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు మాత్రమే ఉండాల్సి ఉంటుంది. అలాగే బల్క్ ఎస్ఎంఎస్ లపై కూడా నిషేధం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు.

ఇక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే అన్ని నియోజక వర్గాల్లో ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల పేరు, పార్టీ పేరు, పార్టీ గుర్తు లేని ఓటరు స్లిప్పులను మాత్రమే పంపిణీ చేయాలని అభ్యర్థులకు ఈసీ సూచించింది. పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో ఇవాళ, రేపు మరింత ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు.

కాగా, తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటరీ నియోజక వర్గాలకు సార్వత్రిక ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉప ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 172 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇక మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్న నియోజక వర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం నాలుగు గంటలకు సభ ముగిసింది. మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించడంతో మొదలైన ఎన్నికల ప్రచారం దాదాపు 60 రోజుల తర్వాత ముగిసింది. మే 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో పోలింగ్ జరగనుంది. రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని ఒక గంట పాటు సాయంత్రం 6.00 గంటల వరకు పొడిగించింది. నాలుగో విడతలో భాగంగా జరుగుతున్న ఈ పోలింగ్ అనంతరం జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఎన్నికల ఆంక్షలు:

ఐదుగురికి మించి రోడ్డు పైకి రాకూడదు..

మైక్రోఫోన్లు, స్పీకర్ల ద్వారా పాడటం, ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం నిషేధం.

బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిరి వంటి నిర్మాణాలు అనుమతించరు.

వ్యక్తులు, సంఘాల మధ్య ద్వేషాన్ని రెచ్చ గొట్టే ప్లకార్డులు, చిత్రాలు, సంకేతాలను ప్రదర్శించడం నిషేధం..

కర్రలు, తుపాకులు, మారణాయుధాలతో కూడిన జెండాలను పోలింగ్ కేంద్రాల నుంచి కిలో మీటరు దూరం వరకు తీసుకెళ్ల కూడదు.

ఆత్మ రక్షణ కోసం కర్రలు, తుపాకులు, మారణాయుధాలు వాడడాన్ని నిషేధం..

మద్యం, మద్యం దుకాణాలు, బార్లు, మద్యం విక్రయించే అన్ని దుకాణాలను మూసి వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది..

Views: 30
Tags:

About The Author

Related Posts

Latest News