Khelo India: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: ఉప్పల శ్రీనివాస్ గుప్త.

On
Khelo India: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: ఉప్పల శ్రీనివాస్ గుప్త.

నాగోల్, రాజముద్ర వెబ్ డెస్క్: ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్ లీగ్ ను జెండా ఊపి  ఉప్పల శ్రీనివాస్ గుప్త ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్త్రం హైదరాబాద్ నగరంలోని నాగోల్, బండ్లగూడ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఆవరణలో ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్ లీగ్ (సౌత్ జోన్ హైదరాబాద్) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐ.వి.ఎఫ్ - (అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్) నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త విచ్చేసి, జెండా ఊపి ప్రారంభించినారు. ఈ పోటీలు రెండు రోజుల పాటు మార్చి 30 నుండి మార్చి 31 వరకు నిర్వహించినారు. ఈ పోటీలలో మొత్తం ఫైవ్ స్టేట్స్ సౌత్ స్టేట్స్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి క్రీడాకారులు 75 మంది మెంబర్స్ పాల్గొన్నారు. ఈ పోటీలలో అండర్-16, అండర్-18, అండర్-18+ జూనియర్స్ అండ్ సీనియర్స్ ఉమెన్స్ క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. ఆటల పోటీలు క్రీడాస్ఫూర్తిని పెంచుతాయని, గెలుపు ఓటములు ముఖ్యం కాదని, ప్రతి ఆటను స్పోర్టివ్ గా తీసుకోవాలని క్రీడాకారులు స్పోర్టివ్ గా ఆడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కొంత సమయం ఆటల కోసం కేటాయిస్తే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. క్రీడాకారులు మంచిగా క్రీడలలో రాణించి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో  విజయం సాధించి, దేశానికి , తెలంగాణ రాష్ట్రానికి, వారి తల్లిదండ్రులకు  మంచి పేరు తేవాలని అన్నారు.


ఈ కార్యక్రమంలో ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్ లీగ్ సౌత్ జోన్ కో ఆర్డినేటర్ డా. మాక్స్వెల్ ట్రావెర్, ఎస్కే. పాషా, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Views: 2
Tags:

About The Author

Related Posts

Latest News