Bheema Devarapalli: స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలి

• బీజేపీ మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ 

On
Bheema Devarapalli: స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలి

స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలి

ఘనంగా స్వామి వివేకానంద 162 వ జయంతి వేడుకలు 
బీజేపీ మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ 

భీమదేవరపల్లి జనవరి 12 (రాజముద్ర) 

హనుమకొండ  జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో  స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద చిత్రపటానికి బిజెపి మండల అధ్యక్షులు శ్రీరాములు శ్రీనివాస్  పూలమాల వేసి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద హిందూ మత ఔన్నత్యాన్ని, భారత దేశ సాంస్కృతిక - చారిత్రక వారసత్వం, వైభవాన్ని ప్రపంచ సర్వమత మహాసభలో చాటి చెప్పారన్నారు. తన ప్రసంగాలతో భారత జాతిని మేల్కొల్పారు. దేశ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు వారికి కర్తవ్యాన్ని బోధించారన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలన్నారు. స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య, మూల రాము గౌడ్, అంబీర్ కవిత తీగల రాజు, దొంగల వేణు, రాణాప్రతాప్, పోడేటి బిక్షపతి, బైరి సదానందం, గద్ద రాజేందర్, రఘు, ప్రదీప్ రెడ్డి, లక్కీరెడ్డి మల్లారెడ్డి, కాలేరు వికాస్, గొల్లపల్లి నవీన్, అలుగు భాస్కర్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:  Grampanchayat: Bheema Devarapalli : 'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్*

Views: 7
Tags:

About The Author

Latest News

Grampanchayat: Bheema Devarapalli : 'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్* Grampanchayat: Bheema Devarapalli : 'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్*
Gram Panchayat Eections, Bheema Devarapalli:    'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్* - సర్పంచ్ గా పోటీ చేసేందుకు యువత ఆసక్తి  -రిజర్వేషన్ల ఖరారు పై...
Hanamkonda, Bheema Devarapalli: వీరభద్ర స్వామి ఆలయ హుండీ లెక్కింపు పూర్తి
Experiam Park, CM Revanth Reddy: అద్భుత కళాఖండంగా ఎక్స్పీరియమ్ పార్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Shankarpally: భర్తకు బాసటగా నిలుస్తున్న భార్య
Veerabhadra Swamy: కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో అగ్ని గుండాలపై నడుస్తున్న భక్తులు
Kothapally village vehicle Overturned: వాహనం బోల్తా..
Kothakonda Jathara: కొత్తకొండ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి