Kothakonda Jathara: కొత్తకొండ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
• డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య
On
భీమదేవరపల్లి జనవరి 13 రాజముద్ర
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏ అప్పయ్య వైద్య సిబ్బందికి సూచించారు. జాతరలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి సిబ్బంది అందిస్తున్న సేవలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. 18వ తేదీ వరకు వైద్య శిబిరం కొనసాగుతుందన్నారు. 36 మంది పారా మెడికల్ సిబ్బందిని మూడు షిఫ్ట్ లలో డ్యూటీలు వేశామన్నారు. అత్యవసర నిమిత్తం108 సర్వీస్ అను అందుబాటులో ఉంచామన్నారు. ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను కూడా భక్తులకు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్ రెడ్డి, అశోక్ రెడ్డి, మౌనిక,వినోద్ కుమార్, రాజేశ్వర్ రెడ్డి, విమల కుమారి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Views: 233
Tags:
About The Author
Related Posts
Latest News
Grampanchayat: Bheema Devarapalli : 'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్*
30 Jan 2025 13:23:40
Gram Panchayat Eections, Bheema Devarapalli: 'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్* - సర్పంచ్ గా పోటీ చేసేందుకు యువత ఆసక్తి -రిజర్వేషన్ల ఖరారు పై...