Experiam Park, CM Revanth Reddy: అద్భుత కళాఖండంగా ఎక్స్పీరియమ్ పార్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

• చిరంజీవితో కలిసి ఎక్స్ పీరియంను ప్రారంభించిన ముఖ్యమంత్రి 

On
Experiam Park, CM Revanth Reddy: అద్భుత కళాఖండంగా ఎక్స్పీరియమ్ పార్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Experiam Park:

అద్భుత కళాఖండంగా ఎక్స్పీరియమ్ పార్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

చిరంజీవి(Chiranjeevi)తో కలిసి ఎక్స్ పీరియంను ప్రారంభించిన ముఖ్యమంత్రి 

IMG-20250128-WA1823

శంకర్ పల్లి, రాజముద్ర న్యూస్:

Also Read:  Kothapally village vehicle Overturned: వాహనం బోల్తా..

ప్రపంచంలోనే అత్యంత ఈకో ఫ్రెండ్లీ(Eco Friendly), అత్యధిక జాతుల మొక్కలు(Plants), వైవిధ్యమున్న శిలలు(Rocks), శిల్పాలు కలిగిన "ఎక్స్ పీరియం"(Experiam) వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన  ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి (C M Enumula Revanth Reddy), పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి.(Mega Star Chiranjeevi) పాల్గొన్న పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావుJupally Krishna Rao), ఎక్స్ పీరియం చైర్మన్ రామడుగు రామ్ దేవ్ రావు( Ramadu Ramdev Rao), రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) , చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు కాలె యాదయ్య ( Kale Yadaiah). స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ...
రామ్ దేవ్  రావ్ దేశంలో ఈ ప్రాంతాన్ని ప్రథమంగా ఎంచుకున్నందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోని 85 దేశాల
నుంచి మొక్కలు తెచ్చి, ఈ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. లండన్ కాదు, ప్యారిస్ కాదు మన హైదరాబాద్ కు వన్నె తెచ్చినందుకు, ఆయనకు మరింత శక్తినివ్వాలని భగవంతున్ని కోరుకుంటున్నానని అన్నారు.  హిమాయత్ నగర్ నుండి వికారాబాద్ వరకు ఈ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డు చేయాలని సిఎంను సభా ముఖంగా కోరుతున్నా అని అన్నారు. రాబోయే కాలంలో చాలా మంది పర్యాటకులు ఈ ప్రదేశానికి వచ్చే అవకాశం ఉన్నందున, ఈ రోడ్డును విస్తరించాలని కోరారు.

Also Read:  Be Careful: పిల్లలు.. పతంగులతో పైలం 


దేశానికే తలమాణికం ఈ ఎక్స్ పీరియం : మంత్రి జూపల్లి కృష్ణారావు

గడచిన 25 ఏళ్ల నుంచి ఒక కలగని, సుదీర్ఘంగా తపన పడుతూ దీనిని నిజం చేశారు. గ్రేట్ ఎక్స్ పీరియన్స్ ఈ ఎక్స్ పీరియం. దేశానికే కాదు.. ప్రపంచానికి తలమానికం ఈ ఎక్స్ పీరియం అని అన్నారు. అయన మాట్లాడుతూ 
హైదరాబాద్ అంటే ఆకాశహార్మ్యాలు, గుడులు, చెరువులతో పాటు ఎక్స్ పీరియం కూడా వచ్చి చేరింది.
తెలంగాణకు ఇది మణిహారం లాంటిదని, హైదరాబాద్ లో  గోల్కొండ, చార్మినార్ సరసన చేరడం ఖాయమని తెలిపారు. లైఫ్ చాలా చిన్నది..విలువైంది. ఇలాంటి ప్రకృతి అందాలు చూసి ఆనందించాలన్నారు.
అమెరికాలో వారానికి 2 రోజులు ఆట విడుపు గడుపుతారని, కనీసం సంవత్సరానికి మనం 10,15 రోజులు గడపాలన్నారు. దీనివల్ల మన ఆలోచన విధానం మారుతుందని, ఆహ్లాదం కలుగుతుందన్నారు. యావత్తు రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని కూడా చూడదగె విధంగా తీర్చిదిద్దుతామన్నారు.
ఇంత గొప్ప నిర్మాణాన్ని చేపట్టిన రామ్ దేవ్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు.

ఎక్స్ పీరియం అద్భుతం : ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy):

IMG-20250128-WA1826

Also Read:  Bheema Devarapalli: స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలి


ఎకో టూరిజం ప్రారంభించడానికి తన పాతిక సంవత్సరాల ఆదాయాన్ని, అనుభవాన్ని ఈ 150 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేసి నాతో పాటు చిరంజీవి, మంత్రులు, నాయకులతో కలిసి ప్రారంభింపజేసినందుకు అభినందనలు.
మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులు, మంత్రులతో చర్చింది తెలంగాణ ఐటీ, ఫార్మా రంగాలలో రాణించాం. మౌలిక సదుపాయాల రంగంలో దేశంలోనే ప్రముఖ సంస్థలు రాష్ట్రంలోకి వచ్చాయి.
తెలంగాణకు కావల్సింది టెంపుల్ , హెల్త్ టూరిజం, ఈకో టూరిజం రావాలి. ఈ రెండు రాష్ట్ర గుర్తింపు గౌరవాన్ని పెంచుతాయి.
శుభకార్యక్రమాలు చేయాలంటే ఇతర దేశాలు, ప్రాంతాలకు వెళ్లి చేసుకుంటున్నారు. బెంగుళూరు జిందాల్లో చేరాం అంటుంటారు. మందిరాలు దర్శించాలంటే తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాం. ఫారెస్ట్ ప్రకృతిని చూడాలంటే మధ్యప్రదేశ్ కు వెళ్తున్నాం. 
కానీ అన్ని సదుపాయాలున్న తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ , ఎకో, టెంపుల్ టూరిజం మీద దృష్టి పెట్టలేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలున్నాయి. నల్లమల్ల టైగర్ ఫారెస్ట్, కృష్ణానది జలాలు పారిస్తున్న ప్రాంతం, మల్లెల తీర్థం వంటి ప్రాంతాలున్నాయి. వీటికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఎకో టూరిజం వెనుకబడుతుంది. 
ఇటీవలే ఎకో టూరిజంపై క్యాబినెట్ లో చర్చించాం. త్వరలోనే టూరిజం పాలసీ తీసుకొస్తాం. కానీ ప్రభుత్వం 
కంటే ముందే ఎకో టూరిజం మీద అద్భుతాన్ని సృష్టించారు. ఇది రాష్ట్రానికి గుర్తింపు, గౌరవం, ఆదాయం తీసుకొస్తుందన్నారు.
ప్రముఖులు ఇళ్లు కట్టుకుంటే గోదావరి జిల్లా నుంచి మొక్కలు తెప్పించుకునే పరిస్థితి నుంచి నేడు ఇక్కడి నుంచి మొక్కలు తెచ్చుకునేటట్లు చేశారన్నారు.
ఇక్కడ జరిగిన అభివృద్ధి 30 శాతమే. రానున్న ఏడాదిలో అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మారుతుందన్నారు.
వ్యాపార కేంద్రంగానే కాకుండా పర్యాటక క్షేత్రంగా  అవతరిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక ప్రత్యేకత ఉందని, రాష్ట్రం ఆలోచనకు అనుగూణంగా ఉందని, ఎకో టూరిజంలో ఎలాంటి పార్కులు డెవలప్ చేయాలనుకుంటున్నామో, వరి పండిచడమే పాటు, ప్రకృతి వనరులు పెంచాలనుకుంటున్నామన్నారు. రైతులు పెంచే మొక్కలను కూడా కొనుగోలు చేసేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. మొక్కలు పెంచడానికి క్షేత్రాలు ఇస్తున్నామన్నారు. ఆరు నెలలే పెంచడం వల్ల 20, 30 శాతానికి మించి బతకడం లేదని, 2,3 సంవత్సరాలు
నిండి, పెంచిన మొక్కలు నాటితే బాగా బతుకుతాయని, ఒక్క సీజన్ కాపాడితే సరిపోతుందన్నారు. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులకు  ఆదేశాలు ఇస్తాను అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధివిధానాలు చర్చించి, సవరించి ప్రకృతి పరిరక్షణ కోసం పాటుపడుమన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపి అనిల్ యాదవ్, సి ఎం రమేష్, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్,యాంకర్ సుమా, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Views: 63

About The Author

Latest News

Grampanchayat: Bheema Devarapalli : 'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్* Grampanchayat: Bheema Devarapalli : 'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్*
Gram Panchayat Eections, Bheema Devarapalli:    'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్* - సర్పంచ్ గా పోటీ చేసేందుకు యువత ఆసక్తి  -రిజర్వేషన్ల ఖరారు పై...
Hanamkonda, Bheema Devarapalli: వీరభద్ర స్వామి ఆలయ హుండీ లెక్కింపు పూర్తి
Experiam Park, CM Revanth Reddy: అద్భుత కళాఖండంగా ఎక్స్పీరియమ్ పార్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Shankarpally: భర్తకు బాసటగా నిలుస్తున్న భార్య
Veerabhadra Swamy: కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో అగ్ని గుండాలపై నడుస్తున్న భక్తులు
Kothapally village vehicle Overturned: వాహనం బోల్తా..
Kothakonda Jathara: కొత్తకొండ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి