Telangana: హైదరాబాద్‌లో మరో ఘోరం.. 

ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం

On
Telangana: హైదరాబాద్‌లో మరో ఘోరం.. 

హైదరాబాద్‌లో మరో ఘోరం.. 

 

-ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం.!

-ట్రైన్ నుంచి దూకేయ్యడంతో గాయపడిన యువతి
-గాంధీ ఆసుపత్రికిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

తెలంగాణ, రాజముద్ర డెస్క్:

Also Read:  Bheemadevarapally, Gatlanarsingapur: విద్యార్థులు పరీక్షల్లో మానసిక ఒత్తిడికి గురికావద్దు 

ఎంఎంటీఎస్ (MMTS) రైలులో ఒక దుర్ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా ప్రయాణిస్తున్న యువతిపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో యువతి రైలు (Train) నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. మేడ్చల్‌ (Medchal) లో ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న అనంతపురం (Ananthapuram) జిల్లాకు చెందిన యువతి తన సెల్ ఫోన్ రిపేరు కోసం సికింద్రాబాద్ వెళ్లి, పని ముగిసిన తర్వాత తిరిగి ఎంఎంటీఎస్‌లో బయలుదేరింది. ఆమె మహిళా కోచ్‌లో ప్రయాణిస్తుండగా, ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ (Alwal) స్టేషన్‌లో దిగిపోయారు. ఆ తర్వాత బోగీలో ఒంటరిగా ఉన్న యువతి పై యువకుడు (25) అత్యాచారయత్నం చేయబోయాడు. దీంతో ఆమె అతని నుంచి తప్పించుకునేందుకు కొంపల్లి (Kompalli) సమీపంలోని రైల్వే బ్రిడ్జ్ (Bridge) వద్ద రైలు నుంచి దూకింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన యువతిని గాంధీ (Gandhi) ఆసుపత్రికి (Hospital) తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:  Telangana, వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్ ఎందుకో తెలుసా? 

Views: 84
Tags:

About The Author

Latest News